ETV Bharat / crime

తాగిన మైకంలో దొంగ అనుకుని మూకుమ్మడి దాడి.. వ్యక్తి మృతి

author img

By

Published : Dec 17, 2021, 8:20 AM IST

Updated : Dec 17, 2021, 9:24 AM IST

hotel staff attack, Hotel Moghuls Paradise Incident
తాగిన మైకంలో మూకుమ్మడి దాడి

08:11 December 17

Hotel Moghuls Paradise Incident: బుధవారం అర్ధరాత్రి మొఘల్స్ ప్యారడైజ్ రెస్టారెంట్ సెల్లార్‌లో ఘటన

Hotel Moghuls Paradise Incident: మద్యం మత్తులో ఓ వ్యక్తిని దొంగగా భావించి చితకబాదటంతో అతను మృతి చెందిన ఘటన కెేపీహెచ్​బి కాలనీలో చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన రాజేశ్ మాదాపూర్​లో కుటుంబంతో సహా నివసిస్తూ, భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

బుధవారం ప్రగతినగర్​లో పని ముగించుకొని అర్థరాత్రి బిర్యానీ కోసమని, కూకట్​పల్లి జాతీయ రహదారిపై ఉన్న మొఘల్స్ ప్యారడైజ్ రెస్టారెంట్ సెల్లార్​ దగ్గరకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడ జన్మదిన వేడుకలు చేసుకుంటున్న హోటల్ సిబ్బంది, రాజేశ్​ని దొంగగా భావించారు. అప్పటికే తాగి ఉన్న వారు విచక్షణరహితంగా అతనిపై దాడి చేసి.. అక్కడే వదిలేసి వెళ్లారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో రెస్టారెంటు వద్దకు వచ్చిన సిబ్బంది, అపస్మారక స్థితిలో పడి ఉన్న రాజేశ్​ను చూశారు. అతని జేబులోని చీటీలో గల ఫోన్ నంబర్ ఆధారంగా అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేశ్ భార్య, అతడిని ఇంటికి తీసుకొని వెళ్లింది.

ఆస్పత్రికి తీసుకెెళ్లేందుకు డబ్బుల్లేక

తన దగ్గర ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో.. అతనిని ఇంటి దగ్గరే ఉంచింది. ఉదయం 11.30 గంటల సమయంలో రాజేశ్ మృతి చెందాడు. మృతుని భార్య మాదాపూర్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. తమ పరిధి కాదంటూ కేపీహెచ్​బీ ఠాణాకు వెళ్లాలని సూచించారు. రాజేశ్ భార్య ఫిర్యాదుతో కేపీహెచ్‌బీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నలుగురు రెస్టారెంట్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: Movie Style Theft: స్పెషల్ చబ్బీస్ సినిమా స్ఫూర్తితో దోపిడీ... కట్ చేస్తే!

Last Updated :Dec 17, 2021, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.