ETV Bharat / crime

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. మృతదేహంతో ఆందోళన!

author img

By

Published : Apr 28, 2021, 7:18 AM IST

a man dead in road accident, protest with dead body
మృతదేహంతో ఆందోళన, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మతి

నల్గొండ జిల్లా పెద్దవూరలో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా... న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. మృతుడి భార్య గర్భవతిగా ఉందని వాపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి నచ్చజెప్పారు.

నల్గొండ జిల్లా పెద్దవూరలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందగా… న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో ఆందోళన చేపట్టారు. పోతునూరు స్టేజి వద్ద ద్విచక్రవాహనం, కారు ఢీకొని ఈదుల గూడెంకు చెందిన సైదయ్య మృతి చెందాడు. మృతుడికి భార్య ఒక బాబు ఉండగా... ప్రస్తుతం ఆమె గర్భవతి అని కుటుంబసభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.

కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆందోళన విరమించాలని మృతుడి కుటుంబసభ్యులకు నచ్చజెప్పారు.

ఇదీ చదవండి: పుట్టింటికి వచ్చి.. ఇద్దరు పిల్లలతో సహా అదృశ్యమైన మహిళ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.