ETV Bharat / crime

student died: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. యువతి దుర్మరణం

author img

By

Published : Oct 6, 2021, 5:28 AM IST

భవిష్యత్తుపై కొండంత భరోసాతో పరీక్ష రాసింది ఆ యువతి. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆమె తలరాత మారిపోయింది. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆమెను వెంటాడింది. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివపల్లి వద్ద జరిగింది.

a engineering student died in road accident
సదాశివపల్లిలో విషాదం

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివపల్లిలో విషాదం చోటు చేసుకుంది. హుజూరాబాద్​లోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. పీజీ పరీక్ష రాసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న యువతిని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో జంగపల్లి మౌనిక (23) అక్కడికక్కడే మృతి చెందింది.

గంగాధర మండలం హిమ్మత్​నగర్​కు చెందిన జంగపల్లి మౌనిక (23) సింగాపూర్​లో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలో పీజీ పరీక్ష రాసేందుకు వెళ్లింది. ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో సదాశివపల్లి వద్దకు రాగానే ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు లారీతో పాటు డ్రైవర్​ను అదుపులోకి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఆన్​లైన్​లో మందు.. హోండెలివరీ ఫ్రీ.. టెంప్టింగ్​ ఆఫర్లతో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.