ETV Bharat / crime

పటాన్​చెరు టోల్​గేట్​ వద్ద 280 కిలోల గంజాయి సీజ్​

author img

By

Published : Apr 25, 2021, 4:37 PM IST

పటాన్​చెరు టోల్​గేట్​ వద్ద గంజాయి స్వాధీనం
తెలంగాణ నేర వార్తలు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు టోల్​ప్లాజా వద్ద ఓ కారులో తరలిస్తున్న ఎండు గంజాయి పట్టుబడింది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు నుంచి జహీరాబాద్​కు తీసుకెళ్తున్న 280కిలోల ఎండు గంజాయిని మెదక్​ అబ్కారీ, ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల నుంచి జహీరాబాద్​కు తరలిస్తున్న ఎండు గంజాయిని పటాన్​చెరు టోల్​గేట్​ వద్ద పోలీసులు పట్టుకున్నారు. 280 కిలోల గంజాయి, ఓకారును సీజ్​చేశారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్​పూర్ తండాకు చెందిన బానోతు తులసీరామ్, నాల్కల్ మండలం రామతీర్థకు చెందిన బ్యాగరి తుకారాం... ఏపీ నుంచి జహీరాబాద్​కు గంజాయి తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న మెదక్​ డివిజన్​ అబ్కారీ, ఎన్​ఫోర్స్​మెంట్ పోలీసులు... సూపరింటెండెంట్​ గాయత్రి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. స్కార్పియో వాహనంలో 140 ప్యాకెట్లలో తీసుకెళ్తున్న 280కిలోల గంజాయిని పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్​ చేసి... ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.


ఇదీ చూడండి: కొవిడ్ చికిత్స పొందుతున్న నేవీ ఉద్యోగి ఆత్మహత్య.. కారణమేంటంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.