జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాలలో గ్యాస్ సిలిండర్ వాహనం ఢీకొట్టడంతో... రియాన్స్ అనే 16 నెలల బాలుడు మృతి చెందాడు. కోరుట్లకు చెందిన శ్రీరామ గ్యాస్ ఏజన్సీ సిబ్బంది తాండ్రియాలకు గ్యాస్ సిలిండర్ల సరఫరాకు వచ్చారు. ఆ సమయంలో బాలుడి తల్లి తేజస్విని సిలిండర్ తీసుకుని తన బిడ్డను అక్కడే నిలబెట్టి డబ్బుల కోసం ఇంట్లోకి వెళ్లింది. వ్యాన్ డ్రైవర్ అది గమనించకుండా వాహనాన్ని వెనకకు తీస్తుండడంతో బాలుడు రియాన్స్ దాని కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.
వెంటనే వ్యాన్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. రియాన్స్ను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కోరుట్ల పట్టణంలోని గ్యాస్ ఏజన్సీ ముందు బాలుని మృతదేహంతో... బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాలుడి మృతికి ఏజన్సీ నిర్వహకులలే కారణమని ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: పగిలిన గూడెం ఎత్తిపోతల పథకం పైప్లైన్... నీటిపాలైన 200 ఎకరాలు