ETV Bharat / city

మర్డర్​ చిత్రంపై నల్గొండ కోర్టులో వాదనలు.. రాంగోపాల్​ వర్మ గైర్హాజరు

author img

By

Published : Aug 6, 2020, 4:27 PM IST

ramgopal varma
మర్డర్​ చిత్రంపై నల్గొండ కోర్టులో వాదనలు.. రాంగోపాల్​ వర్మ గైర్హాజరు

'మర్డర్​' చిత్రం విడుదలను అడ్డుకోవాలంటూ నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అమృత వ్యాజ్యంపై ఇవాళ విచారణ జరిగింది. దర్శన నిర్మాతలు రాంగోపాల్​వర్మ, నట్టి కరణ గైర్హాజరుతో విచారణను ఈనెల 11కు నల్గొండ జిల్లా కోర్డు వాయిదా వేసింది.

'మర్డర్'​ చిత్రం విడుదలను అడ్డుకోవాలని కోరుతూ నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అమృత పిటిషన్​పై నల్గొండ జిల్లా కోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. ఈ సినిమాలో తనను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ దర్శకుడు రాంగోపాల్​ వర్మ, నిర్మాత నట్టి కరుణపై ఆమె వ్యాజ్యం దాఖలు చేశారు. ఇవాళ్టి విచారణకు దర్శకనిర్మాతలు హాజరుకావలసి ఉన్నా.. వారి తరఫు న్యాయవాది కోర్టును గడువు కోరారు. అనుమతించిన న్యాయస్థానం విచారణను ఈనెల 11కు కోర్టు వాయిదా వేసింది.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్​ పరువు హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను ఆధారంగా తీసుకొని మర్డర్​ పేరుతో దర్శకుడు రాంగోపాల్​ వర్మ సినిమా తీశారు. అయితే ఈ కథ తమను కించపరిచేలా ఉందని, చిత్రం విడుదలను అడ్డుకోవాలని నల్గొండ కోర్టులో ప్రణయ్​ భార్య అమృత పిటిషన్​ దాఖలు చేశారు.

మర్డర్​ చిత్రంపై నల్గొండ కోర్టులో వాదనలు.. రాంగోపాల్​ వర్మ గైర్హాజరు

ఇవీచూడండి: 'మర్డర్​' నిజ జీవిత కథ అని చెప్పలేను: వర్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.