ETV Bharat / city

రైతుల ఖాతాల్లో రూ.1252 కోట్ల పంట బీమా సొమ్ము జమ

author img

By

Published : Dec 15, 2020, 7:13 PM IST

ఏపీలో వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ప్రారంభించారు. కలెక్టర్లు, లబ్ధిదారులతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రూ.1,252 కోట్ల బీమా సొమ్మును రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. 2019 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు పరిహారం అందించనున్నారు.

jagan
రైతుల ఖాతాల్లో రూ.1252 కోట్ల పంట బీమా సొమ్ము జమ

రైతులకు నష్టం లేకుండా బీమా సొమ్ము అందించాలన్నదే తమ లక్ష్యం అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పంట నష్టం జరిగితే బీమా వస్తుందన్న నమ్మకం రైతుల్లో కలగాలన్న సీఎం.. కోటి 14 లక్షల ఎకరాలను బీమా పరిధిలోకి తీసుకొచ్చామని వివరించారు.

ఏపీలో 10,641 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయని..గ్రామ సచివాలయాలతో ఆర్బీకేలను అనుసంధానించామన్నారు. ఆర్బీకే పరిధిలోని ఈ-క్రాపింగ్‌ డేటా ఆధారంగా పంట నష్టం వివరాలు తెలుసుకుంటున్నామని ముఖ్యమంత్రి జగన్​ వెల్లడించారు.

రైతుల ఖాతాల్లో రూ.1252 కోట్ల పంట బీమా సొమ్ము జమ

ఇవీచూడండి: 'రైతుల ఆందోళనతో రోజుకు రూ.3,500 కోట్లు నష్టం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.