TRS MPs boycott: 'ధాన్యం సేకరణపై సమగ్ర జాతీయ విధానం కావాలంటూ తెరాస బాయ్‌కాట్'

author img

By

Published : Dec 7, 2021, 12:27 PM IST

TRS MPs Protest in Parliament

TRS MPs boycott in loksabha:ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్​లో తెరాస నిరసన కొనసాగుతూనే ఉంది. కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడం పట్ల గులాబీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న తెరాస ఎంపీలు ఇవాళ.. నల్లచొక్కాలు ధరించి నిరసన తెలిపారు. లోక్​సభ నుంచి బాయ్​కాట్ చేశారు.

TRS MPs boycott in loksabha: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టతనివ్వకపోవడం పట్ల పార్లమెంట్​లో తెరాస ఎంపీల నిరసన కొనసాగుతూనే ఉంది. కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా లోక్​సభ నుంచి తెరాస ఎంపీలు బాయ్​కాట్ చేశారు. లోక్​సభ నుంచి బయటకు వచ్చిన పార్లమెంట్​ సభ్యులు.. మోదీ సర్కార్​కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ధాన్యం సేకరణకు సమగ్ర జాతీయ విధానం తేవాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఆందోళనకు దిగారు. ధాన్యం, బియ్యం ఎంత సేకరిస్తారో స్పష్టం చేయాలని కోరారు.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.