ETV Bharat / city

Telangana News Today : టాప్​న్యూస్ @ 1PM

author img

By

Published : Jun 27, 2022, 12:59 PM IST

Telangana News Today
Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

  • రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్​

విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ వేశారు. ఆ సమయంలో ఆయన వెంట కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు ఉన్నారు.

  • ఆ​ ఎమ్మెల్యేలు రూ.50 కోట్లకు అమ్ముడుపోయారు

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో ములుపు తిరుగుతున్నాయి. శివసేన తిరుగుబాటు నేతలకు కేంద్రం వై- ప్లస్​ కేటగిరీ భద్రతను చూస్తుంటే వారి వెనుక భాజపా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని ఆ పార్టీ సొంత పత్రిక 'సామ్నా' విమర్శించింది. మరోవైపు, శాసనసభాపక్ష నేతగా తనను తొలగిస్తూ డిప్యూటీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో శిందే వేసిన పిటిషన్​పై సోమవారం విచారణ జరగనుంది.

  • స్నానానికి నదిలో దిగి కొట్టుకుపోయిన వ్యక్తి

స్నానం చేసేందుకు నదిలో దిగి కొట్టుకుపోయిన ఓ వ్యక్తిని స్థానిక యువకులు కాపాడిన సంఘటన ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లో జరిగింది. ఆదివారం స్థానికంగా ఉన్న గంగానహర్​లో స్నానానికి దిగాడు ఓ వ్యక్తి. కాసేపటికే నీటి ప్రవాహం ఎక్కువవ్వడం వల్ల కొట్టుకుపోయాడు. అది గమనించిన ముగ్గురు యువకులు వెంటనే నీటిలో దూకారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు.

  • గజ్వేల్‌కు గూడ్స్‌ బండి

సీఎం కేసీఆర్ నియోజకవర్గ కేంద్రమైన సిద్దిపేట జిల్లా గజ్వేల్​కు నేటి నుంచి గూడ్స్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఇందుకోసం గజ్వేల్‌ రైల్వే స్టేషన్‌లో ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.

  • టోల్​ ప్లాజా వద్ద ప్రమాదం.. గర్భిణికి నరకయాతన

కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఫలితంగా కారులో ప్రయాణిస్తున్న గర్భిణికి తీవ్ర గాయాలై గంటపాటు నరకయాతన అనుభవించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

  • కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

ముంబయి నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో పొగలు వ్యాపించాయి. రైలును డోర్నకల్ జంక్షన్‌ రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. ఏసీ బోగీలో పొగలు రావడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. దీనిపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.

  • ఆ ఘనత సాధించిన భారత ఏకైక కెప్టెన్​గా హార్దిక్​ పాండ్య

ఐర్లాండ్​తో తొలి టీ20 సందర్భంగా అరుదైన ఘనత సాధించాడు టీమ్​ఇండియా సారథి హార్దిక్ పాండ్య. టీ20ల్లో వికెట్ తీసిన భారత తొలి కెప్టెన్​గా రికార్డులకెక్కాడు.

  • తల్లి కాబోతున్న ఆలియా భట్​

బాలీవుడ్‌ బ్యూటీ ఆలియా భట్​ గుడ్​ న్యూస్​ చెప్పింది. తాను తల్లికాబోతున్నట్లు సోషల్​మీడియా వేదికగా వెల్లడించింది.

  • రామ్-శివకార్తికేయన్ మల్టీస్టారర్

రామ్ పోతినేని-బోయపాటి శ్రీను కాంబినేషన్​లో రానున్న సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా మల్టీస్టారర్​గా తెరకెక్కనుందని, ఇందులో రామ్​తో పాటు తమిళ హీరో శివకార్తికేయన్ కూడా నటించనున్నట్లు తెలుస్తోంది.

  • అవి తినడం వల్లేనా గీత.. ఇంత 'మధురం'గా పాడేది?

'వియ్​ లవ్​ బ్యాడ్​ బాయ్స్​..'.. 'మగాళ్లు వట్టి మాయగాళ్లే..' అంటూ తన గాత్రంతో యువతను ఆకట్టుకున్న నవతరం గాయని గీతామాధురి. ట్రెడిషనల్​, మెలోడీస్​, ఫాస్ట్​ బీట్,​ స్పెషల్​ సాంగ్స్​తో ఆకట్టుకోవడమే కాకుండా గ్లామర్​తోనూ కుర్రకారును ఫిదా చేస్తోంది. అయితే తాజాగా ఆమె తనకు ఇష్టమైన ఆహారం ఏంటి? నేర్చుకున్న మొదటి వంట? ఇష్టమైన స్వీట్​? చిన్నప్పుడు బాగా ఇష్టంగా తిన్న చిరుతిళ్లు? నచ్చే ఫ్లేవర్​? సహా పలు విషయాలను తెలిపారు. ఆ సంగతులు ఆమె మాటల్లోనే వినేద్దాం...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.