'ఆ​ ఎమ్మెల్యేలు రూ.50 కోట్లకు అమ్ముడుపోయారు.. మొత్తం స్క్రిప్ట్​ భాజపాదే'

author img

By

Published : Jun 27, 2022, 11:20 AM IST

Maharastra Political Crisi

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో ములుపు తిరుగుతున్నాయి. శివసేన తిరుగుబాటు నేతలకు కేంద్రం వై- ప్లస్​ కేటగిరీ భద్రతను చూస్తుంటే వారి వెనుక భాజపా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని ఆ పార్టీ సొంత పత్రిక 'సామ్నా' విమర్శించింది. మరోవైపు, శాసనసభాపక్ష నేతగా తనను తొలగిస్తూ డిప్యూటీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో శిందే వేసిన పిటిషన్​పై సోమవారం విచారణ జరగనుంది.

Maharastra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు పట్టు వీడటం లేదు. అసోంలోని గువాహటి క్యాంప్ నుంచి బయటకు అడుగుపెట్టడం లేదు. ఏక్​నాథ్ శిందేతోనే ఉంటామని తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో శివసేన సొంత పత్రిక 'సామ్నా' ప్రచురించిన కథనం ప్రాధాన్యం సంతరించుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు లేవనెత్తిన ఆ రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ శిందే, రెబల్ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు గుప్పించింది. తిరుగు బాటు నేతలకు కేంద్రం వై-ప్లస్‌ కేటగిరి భద్రతను కల్పించడాన్ని చూస్తే వారి వెనక భాజపా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని కథనం ప్రచురించింది. ఏక్‌నాథ్‌ నేతృత్వంలోని రెబల్‌ ఎమ్మెల్యేలు రూ.50 కోట్లకు అమ్ముడుపోయారని, స్క్రిప్ట్​ అంతా భాజపాదేనని ఆరోపించింది.

మరోవైపు శివసేన శాసనసభాపక్ష నేతగా తనను తొలగిస్తూ డిప్యూటీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయంపై శిందే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు.. సోమవారం విచారణ జరపనుంది. ప్రస్తుతం అసోంలోని గువహటి హోటల్‌లో ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. మధ్యాహ్నం 2 గంటలకు ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో భవిష్యత్‌ కార్యచరణ, తదుపరి వ్యూహాలు చర్చించనున్నట్లు సమాచారం. మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్‌ సేన వ్యవస్థాపకుడు రాజ్‌ ఠాక్రేతో ఏక్‌నాథ్‌ శిందే సోమవారం ఉదయం ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించినట్లు ఎమ్​ఎన్​ఎస్​ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి

ఇవీ చదవండి: క్షుద్రపూజలతో మహిళ హత్య.. పేగులు తీసి.. ముక్కలుగా నరికి దహనం

తీస్తాకు జులై 2 వరకు పోలీసు కస్టడీ.. కేసు విచారణకు సిట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.