ETV Bharat / city

కుమారుడిని హత్య చేయించిన తల్లి

author img

By

Published : Aug 14, 2020, 5:57 PM IST

కుమారుడి వేధింపులు తాళలేక ఓ తల్లి.. కిరాయి గూండాలతో హత్య చేయించిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా పొన్నలూరులో జరిగింది. నాలుగు నెలల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. తల్లితో సహా మొత్తం 8 మందిని అరెస్టు చేశారు.

son killed by mother
కుమారుడిని హత్య చేయించిన తల్లి

ఏపీలోని ప్రకాశం జిల్లా పొన్నలూరులో దారుణం జరిగింది. దుర్వ్యసనాలు, వేధింపులు తట్టుకోలేక నర్సింగరావు అనే వ్యక్తిని.. కన్న తల్లే కిరాయి గూండాలతో హత్య చేయించింది. నాలుగు నెలల క్రితం జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వేధింపులు తాళలేకే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు.

పొన్నలూరుకు చెందిన నర్సింగరావు నాలుగు నెలల క్రితం హత్యకు గురయ్యాడు. కందుకూరు మండలం దూబగుంట వద్ద, దుండగులు నర్సింగరావును హత్య చేసి పూడ్చి పెట్టారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పొన్నలూరులో ఉన్న నర్సింగరావు తల్లి లక్ష్మమ్మను ప్రశ్నిస్తే.. తన కుమారుడు హైదరాబాద్​ కూలీ పనులకు వెళ్లాడని.. అతనికి ఫోన్​ కూడా లేదని పోలీసులను నమ్మించింది. ఆమె బంధువులు, చుట్టుప్రక్కల గ్రామాల్లో రౌడీ షీటర్లపై నిఘా ఉంచిన పోలీసులు కేసును ఛేదించారు. నర్సింగరావు దుర్వ్యసనాలకు బానిసై తల్లిని వేధించడం వల్లే.. లక్ష్మమ్మ కుమారుణ్ని హతమార్చాలని భావించినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేయడానికి రౌడీ షీటర్లతో రూ.1.70 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. అందులో రూ.50 వేలు చెల్లించారు. నర్సింగరావుకు మద్యం తాగించి దూబగుంటకు తీసుకెళ్లి నరికి చంపి.. పూడ్చిపెట్టారు. మిగిలిన డబ్బు కోసం తేడా రావడం వల్ల హత్య వ్యవహారం బయటపడింది. ఈ కేసులో తల్లి సహా మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్​ తెలిపారు.

ఇవీచూడండి: పసిబిడ్డకు కాలం చెల్లిన మందులిచ్చిన ప్రైవేటు ఆస్పత్రి.. పాప మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.