ETV Bharat / city

ధాన్యం సేకరణపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్న సర్కార్‌

author img

By

Published : Jun 24, 2022, 8:36 PM IST

Ministers on Paddy Procurement: ధాన్యం సేకరణపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ధాన్యం అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో సమావేశం నిర్వహిస్తారని మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ ప్రకటించారు. బీఆర్కే భవన్​లో మంత్రులు సమావేశమయ్యారు. ధాన్యం సేకరణలో విషయంలో తదుపరి కార్యాచరణపై సమీక్షించారు.

Ministers on Paddy Procurement
Ministers on Paddy Procurement

Ministers on Paddy Procurement: యాసంగి సీజన్​కు సంబంధించి ధాన్యం సేకరణ పూర్తి కావడంతో పాటు బియ్యం తీసుకునే విషయంలో భారత ఆహారసంస్థ(ఎఫ్.సి.ఐ.) నిర్ణయం నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగా ధాన్యం సేకరణపై మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ బీఆర్కే భవన్​లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో ధాన్యం సేకరణపై సమీక్షించిన మంత్రులు... పూర్తి వివరాలు, సంబంధిత సమాచారంతో సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే సమీక్ష నిర్వహిస్తారని, అందుకు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. అటు ఎఫ్.సి.ఐ. బియ్యం తీసుకోపోతే ఏం చేయాలన్న విషయమై కూడా సమావేశంలో చర్చించారు. అయితే ఎఫ్.సి.ఐ. తీసుకోక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. యాసంగి ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా కాకుండా సాధారణ బియ్యంగా మారిస్తే వచ్చే వ్యత్యాసానికి సంబంధించిన టెస్ట్ మిల్లింగ్ అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. టెస్ట్ మిల్లింగ్ కొనసాగుతోందని, పూర్తైతే స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.