ETV Bharat / city

Ayyanna patrudu dharna: నర్సీపట్నంలో హైటెన్షన్.. రోడ్డుపైనే బైఠాయించిన అయ్యన్నపాత్రుడు

author img

By

Published : Nov 24, 2021, 5:22 PM IST

Ayyanna patrudu dharna in narsipatnam
నర్సీపట్నంలో తెదేపా శ్రేణుల నిరసన

ఏపీలోని నర్సీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. తెదేపా నేత అయ్యన్నపాత్రుడు(ayyanna patru du dhanrna)చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దారితీసింది. దీంతో రోడ్డుపైనే బైఠాయించి కార్యకర్తలతో కలిసి ఆయన ధర్నాకు దిగారు. తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబంపై(ysrcp mlas comments on cbn) అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఏపీలోని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో(Protest in narsipatnam) ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీలో వైకాపా సభ్యుల అనుచిత ప్రవర్తనకు నిరసనగా తెదేపా నేతలు చేపట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పార్టీ నేత అయ్యన్నపాత్రుడు సహా.. నాయకులు, కార్యకర్తలు నడిరోడ్డుపై ధర్నాకు దిగారు. పోలీసులతో అయ్యన్నపాత్రుడు(ayyanna patrudu dharna on road) వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో అయ్యన్నపాత్రుడి చేతికి గాయమైంది. ఎవరు అడ్డుకున్నా ర్యాలీ ఆగదన్న అయ్యన్న.. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్డుపైనే బైఠాయించిన అయ్యన్నపాత్రుడు

తెదేపా అధినేత చంద్రబాబునాయుడి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా.. విశాఖ జిల్లా నర్సీపట్నంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. అయ్యన్నపాత్రుడి నివాసం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఆందోళనలు(TDP leaders protest in NTR stadium Narsipatnam) చేసేందుకు సమాయత్తమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నేతలు తరలివచ్చారు. ఈ క్రమంలో ర్యాలీకి అనుమతి లేదంటూ నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఫలితంగా.. తెదేపా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ పరిణామాల నడుమ వినతిపత్రం ఇచ్చేందుకు మహిళలను పోలీసులు అనుమతించారు.

నర్సీపట్నంలో తెదేపా శ్రేణుల నిరసన

'కొవిడ్‌ నిబంధనల పేరుతో ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారు. మహిళల గౌరవం కాపాడాలని పవిత్ర కార్యక్రమం చేపట్టాం. పోలీసులకు ఇస్తున్న గౌరవం నిలుపుకోవాలి. వైకాపా మరో రెండేళ్లే అధికారంలో ఉంటుంది. రెండేళ్ల తర్వాత తెదేపా అధికారంలోకి వస్తుంది. తెదేపా అధికారంలోకి వచ్చాక చర్యలు తప్పవు.'

- అయ్యన్నపాత్రుడు, తెదేపా నేత

ఇదీ చూడండి:

Chandra Babu Chittoor Tour: నా సతీమణిపై అనుచిత వ్యాఖ్యలతో ఎంతో బాధపడ్డా: చంద్రబాబు

Chandra Babu Naidu: 'తెదేపా అధికారంలోకి వచ్చాకే అసెంబ్లీలో అడుగుపెడతా..'

Pawan: చంద్రబాబు కంటతడి పెట్టడం బాధ కలిగించింది: పవన్ కల్యాణ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.