ETV Bharat / city

గుండెపోటుతో స్వాతి వారపత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ కన్నుమూత

author img

By

Published : May 11, 2021, 11:35 AM IST

స్వాతి వారపత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ ఎం.మణిచందన గుండెపోటుతో చనిపోయారు. కొద్దికాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న మణిచందన.. అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా.. గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.

స్వాతి వారపత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ కన్నుమూత
స్వాతి వారపత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ కన్నుమూత

మణిచందన

స్వాతి వారపత్రిక మేనేజింగ్‌ ఎడిటర్‌ ఎం.మణిచందన (48) కన్నుమూశారు. స్వాతి వార పత్రిక పబ్లిషర్‌, ఎడిటర్‌ వేమూరి బలరామ్‌కు మణిచందన ఒక్కరే కుమార్తె. ఆమె భర్త అనిల్‌కుమార్‌ ఆదాయపు పన్నుశాఖ ప్రిన్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

మణిచందన కొద్దికాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా.. సోమవారం ఉదయం గుండెపోటుతో చనిపోయారు.

ఇదీ చదవండి: రెమ్‌డెసివిర్‌ అక్రమ విక్రయాల్లో నిందితుల గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.