ETV Bharat / city

AP municipal elections 2021: కొనసాగుతున్న ‘పుర’ ఓట్ల లెక్కింపు

author img

By

Published : Nov 17, 2021, 9:37 AM IST

Updated : Nov 17, 2021, 10:18 AM IST

కుప్పం ఎన్నికల లెక్కింపు కోసం ప్రత్యేక అధికారిని నియామించాలని హైకోర్టు ఆదేశించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ ఎన్.ప్రభాకర్‌రెడ్డిని ఎస్ఈసి నియమించింది.

special officer for counting at kuppam, kuppam elections issue
కుప్పం ఎన్నికల లెక్కింపు కోసం ప్రత్యేక అధికారి నియామకం, ‘పుర’ ఓట్ల లెక్కింపు ప్రారంభం

09:23 November 17

కుప్పం ఎన్నికల లెక్కింపు కోసం ప్రత్యేక అధికారి నియామకం

ఆంధ్రప్రదేశ్​లో నగరపాలక, పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు(AP municipal elections 2021 ) కొనసాగుతోంది. మధ్యాహ్నానికి 1,206 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. వైకాపా, తెలుగుదేశం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కుప్పం.. ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠ రేపుతోంది. కుప్పం ఎంఎఫ్‌సీ వృత్తి విద్యా కళాశాలలో లెక్కింపు(Kuppam muncipal election results 2021) కొనసాగుతోంది. మొత్తం 25 వార్డులకు ఒక వార్డు ఏకగ్రీవం కాగా... మిగిలిన 24 వార్డుల్లో లెక్కింపు జరుగుతోంది. పోలింగ్‌ సందర్భంగా తలెత్తిన అవాంఛనీయ ఘటనలను దృష్టిలో ఉంచుకుని... పటిష్ట భద్రత మధ్య ఓట్లు లెక్కిస్తున్నారు. ఏపీ హైకోర్టు నియమించిన ప్రత్యేక అధికారి ఐఏఎస్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో లెక్కింపు కొనసాగుతోంది. ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేసి వారం రోజుల్లో తమకు సమర్పించాలని ఎస్​ఈసీని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. 

అటు మిగిలిన కార్పొరేషన్‌, నగరపంచాయతీల్లోనూ లెక్కింపు(ap municipal elections results) కొనసాగుతోంది. నెల్లూరు కార్పొరేషన్‌, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఓట్ల లెక్కింపు డీకేడబ్ల్యూయూ కళాశాలలో జరుగుతోంది. కడప జిల్లా రాజంపేట పురపాలిక, కమలాపురం నగర పంచాయతీల్లోనూ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కమలాపురం నగర పంచాయతీ ఫలితాల్లో ...7 వార్డుల్లో వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన 13 వార్డుల్లో లెక్కింపు కొనసాగుతోంది. కాకినాడ నగర పాలక సంస్థలోని 4 డివిజన్లలో లెక్కింపు జరుగుతోంది. అనంతపురం జిల్లా పెనుకొండ నగర పంచాయతీలో ఓట్ల లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదు. సూపర్‌వైజర్లు రాకపోవడంతో రిజర్వ్‌ సిబ్బందితో లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీల్లో 4 వార్డుల్లో తెలుగుదేశం(tdp) అభ్యర్థులు విజయం సాధించారు. 13వ వార్డులో వైకాపా అభ్యర్థి గెలుపొందగా.... 8వ వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. మిగిలిన వార్డుల్లో లెక్కింపు కొనసాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పురపాలిక 23వ వార్డు ఉపఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి రమాదేవి గెలిచారు. కర్నూలు జిల్లా బేతంచర్ల నగర పంచాయతీ, నందికొట్కూరు మున్సిపాలిటీ పదో వార్డు, జీవీఎంసీ పరిధిలో 31, 61 డివిజన్లకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 

ఇదీ చదవండి: lathi charge by police: కుప్పంలో ఉద్రిక్తత.. తెదేపా నేతలపై లాఠీఛార్జ్

Last Updated : Nov 17, 2021, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.