సంక్రాంతికి తెలుగురాష్ట్రాల్లో 200 ప్రత్యేక రైళ్లు.. ఛార్జీలు ఎలా ఉంటాయంటే..?

author img

By

Published : Jan 6, 2022, 5:17 AM IST

South central railway Cpro rakesh special interview
South central railway Cpro rakesh special interview ()

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సీపీఆర్​వో రాకేష్ వెల్లడించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు నడుపుతామని ఆయన తెలిపారు. ఇంతకీ దక్షిణ మధ్య రైల్వే ఎన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతోంది...? ఛార్జీలు ఏవిధంగా ఉంటాయి...? తదితర అంశాలపై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్​వో రాకేష్​తో ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి...

సంక్రాంతికి తెలుగురాష్ట్రాల్లో 200 ప్రత్యేక రైళ్లు.. ఛార్జీలు ఎలా ఉంటాయంటే..?

"సంక్రాంతి పండుగను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లు నడపుతాం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు నడుపుతాం. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నాం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంచుతాం. తెలుగురాష్ట్రాల్లో 200 ప్రత్యేక ట్రిప్పులను నడుపుతాం. శబరిమల యాత్ర కోసం 60 ట్రిప్పులను తిప్పుతాం. డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడుపుతాం. ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు అదనపు ఛార్జీలు విధించం. ప్రయాణ సమయంలో అందరూ కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలి. రైళ్లలో శుభ్రతను పాటించేందుకు కోసం అనేక చర్యలు చేపట్టాం." - రాకేష్, దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్​వో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.