ఎగువ నుంచి పోటెత్తుతోన్న వరద, నిండుకుండల్లా జలాశయాలు

author img

By

Published : Aug 28, 2022, 10:44 AM IST

Updated : Aug 28, 2022, 11:43 AM IST

Nagarjunasagar
నాగార్జునసాగర్​ ()

Heavy Inflow to Reservoirs రాష్ట్రంలోనూ, ఎగువ ప్రాంతాల్లోనూ గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు అన్నీ నిండుకుండలుగా మారాయి. నాగార్జునసాగర్​ 20 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో తరవాత నెలలో వచ్చే వరద నీరును సైతం విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

Heavy Inflow to Reservoirs: ఎగువ నుంచి పోటెత్తున్న ప్రవాహంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండుకుండా మారగా... గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి నాగార్జునసాగర్‌ వరకు కిందకు పరుగులు పెడుతోంది. దీంతో జూరాల జలాశయానికి మళ్లీ వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1.29 లక్షల క్యూసెక్కులుకాగా.. తాజాగా అవుట్‌ఫ్లో 1.27లక్షల క్యూసెక్కులుగా కొనసాగిస్తున్నారు. జూరాల జలాశయం పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 318.070 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 9.657టీఎంసీలు.. ప్రస్తుత నీటినిల్వ సామర్థ్యం 8.750 టీఎంసీలుగా కొనసాగిస్తున్నారు.

నాగార్జునసాగర్​కు పోటెత్తిన వరద.. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదనీటితో సాగర్​ ప్రాజెక్టు పూర్తి నిండుకుండలా మారింది. ఎంతకీ వరద ప్రవాహం తగ్గక పోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు పంపిస్తున్నారు. జలాశయం ఎగువ నుంచి 2 లక్షల 14వేల క్యూసెక్కుల వరద నీరు రావడంతో సాగర్​ 20క్రస్ట్​ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి స్పిల్​వే ద్వారా 1లక్ష 16 వేల120 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నా రు.

సాగర్​ మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులు చేరింది. 312 టీఎంసీల సామర్థ్యం ఉన్న జలాశయం పూర్తిగా నిండిపోయింది. జులై చివరి వారం నుంచి నాగార్జున సాగర్ జలాశయం కు ప్రారంభం అయిన వరద ప్రవాహం తో ఈ నెల 11 నుంచి 26 గేట్లను ఎత్తి 13 రోజుల గా నీటి విడుదల చేపట్టారు. ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహo కాస్త తగ్గుముఖం పట్టడంతో గేట్లను అధికారులు అధికారులు మూసివేశారు.

మళ్లీ నీటి ప్రవహాన్ని బట్టి గేట్లను ఎత్తుతూ మూస్తూ వస్తున్నారు. . ఈ నెల 11 నుంచి ఇప్పటి వరకు దాదాపు 250 టీఎంసీల నీరు దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. వచ్చే సెప్టెంబరు నెలలో ఇంకా వరదలు వస్తే వచ్చిన నీటిని వచ్చినట్టుగానే దిగువకు విడుదల చెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటికే నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది.

నాగార్జున సాగర్​ 20గేట్లు ఎత్తివేత

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ఉధృతి.. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 4 గేట్లు 10 అడుగులు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్‌వే ద్వారా 1.12 లక్షల క్యూసెక్కులు నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 2.35 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. డ్యామ్​ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.90 అడుగులుగా కొనసాగుతోంది. జలాశయం పూర్తి నీటినిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 215.32 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కోసం నీటిని తరలిస్తున్నారు. విద్యుదుత్పత్తి చేసిన తరవాత 63,089 క్యూసెక్కుల నీటిని సాగర్​కు విడుదల చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 28, 2022, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.