ETV Bharat / city

బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం

author img

By

Published : Mar 2, 2022, 8:52 PM IST

Low Pressure Area Over Bay of Bengal: దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాగల 48 గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణశాఖ తెలిపింది. ఫలితంగా ఈనెల 4 నుంచి రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

RAINS IN AP
RAINS IN AP

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రాగల 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ.. శ్రీలంక వైపు నుంచి తమిళనాడు తీరానికి దగ్గరగా వచ్చే సూచనలు ఉన్నాయి. దీని ప్రభావంతో ఈ నెల 4వ తేదీ నుంచి రాయలసీమ, కోస్తాంధ్ర తీరాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది.


ఈ నెల 4 నుంచి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో చాలా చోట్ల వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి 45-55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తా ఆంధ్ర, తమిళనాడు కోస్తా ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

ఇదీ చూడండి: రామయ్య కల్యాణానికి రేపటి నుంచే టికెట్ల విక్రయం.. ధరెంతో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.