Rain in Hyderabad : భాగ్యనగరంలో చిరుజల్లులు.. వానలోనూ గణేశ్ శోభాయాత్ర

author img

By

Published : Sep 19, 2021, 1:38 PM IST

Updated : Sep 19, 2021, 2:22 PM IST

వానలోనూ సాగుతున్న గణేశ్ శోభాయాత్ర

13:16 September 19

వానలోనూ సాగుతున్న గణేశ్ శోభాయాత్ర

వానలోనూ సాగుతున్న గణేశ్ శోభాయాత్ర

భాగ్యనగరాన్ని మరోసారి వరణుడు(Rain in Hyderabad) పలకరించాడు. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు.. మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం(Rain in Hyderabad) కురిసింది. మహాగణపతి నిమజ్జనానికి వెళ్లిన భక్తులు వానలో తడిసిముద్దయ్యారు. 

మొజంజాహి మార్కెట్, కోఠి, సుల్తాన్​బజార్, హుస్సేన్​సాగర్, పాతబస్తీ ప్రాంతాల​లో మోస్తం వాన(Rain in Hyderabad) పడింది. పలుచోట్ల రహదారులు జలమయమయ్యాయి. వర్షంలో(Rain in Hyderabad)నూ గణేశ్ శోభాయాత్ర కొనసాగుతోంది. చిరుజల్లుల్లో తడుస్తూ.. భక్తులు గణపతి ముందు స్టెప్పులేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు రంగంలోకి దిగి వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేశారు. 

ఆకాశమంత మేఘావృతమై ఉండటం వల్ల భారీ వర్షం కురిసే అవకాశముందని కొందరు భక్తులు గణేశ్ శోభాయాత్ర నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. భారీ వాన పడితే.. వరదలో చిక్కుకుంటామేమోనని భయంతో వెనుదిరుగుతున్నారు. ఇంకొందరు మాత్రం జల్లుల్లో తడుస్తూ.. గణేశుణ్ని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు.  

Last Updated :Sep 19, 2021, 2:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.