రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలంలోని కొహెడలో కొత్తగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ను రాచకొండ సీపీ మహేశ్భగవత్ పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుంచి రైతులు తీసుకొచ్చిన మామిడి పండ్లను ఆయన పరిశీలించారు. రైతులు కష్టపడి పండించిన మామిడి పండ్ల మధ్యలోంచి బూటుకాళ్లతో నడవడం ఇష్టంలేక బూట్లు విడిచి మామిడికాయల మధ్య నడిచారు. ఈ విషయం మార్కెట్లో చర్చనీయాంశమయింది. రైతులు, వ్యాపారులు, కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సీపీ సూచించారు.
ఇవీ చూడండి: దివ్యాంగ న్యాయవాదిని చావబాదిన ఎస్సైపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు