ETV Bharat / city

'తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం ఎన్టీఆర్'

author img

By

Published : May 28, 2022, 11:37 AM IST

Balakrishna About NTR : తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోయారని నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్​ రెండు రూపాయలకు కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారని గుర్తుచేశారు. నిమ్మకూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి ఆయన నివాళులర్పించారు.

Balakrishna About NTR
Balakrishna About NTR

Balakrishna About NTR : ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోయారని బాలకృష్ణ అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలా... తానున్నానని ఎన్టీఆర్​ ముందుకొచ్చారని గుర్తుచేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారని తెలిపారు.

Balakrishna Tribute to NTR : నిమ్మకూరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నిమ్మకూరు చెరువు వద్ద ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 35 అడుగుల విగ్రహం ఏర్పాటుకు అంతా తీర్మానించామని స్పష్టం చేశారు. యువకులు రాజకీయాల్లోకి రావాలని... ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏపీని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అంతా చూస్తున్నారన్న బాలకృష్ణ... రాష్ట్ర పరిస్థితిపై మహానాడులో పూర్తిగా మాట్లాడతానని తెలిపారు.

"తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్‌ చిరస్థాయిలో నిలిచిపోయారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలా నేనున్నానని ముందుకొచ్చారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారు. నిమ్మకూరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. నిమ్మకూరు చెరువు వద్ద ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తాం. 35 అడుగుల విగ్రహం ఏర్పాటుకు అంతా తీర్మానించాం. యువకులు రాజకీయాల్లోకి రావాలి.. ఉత్సాహంతో పని చేయాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అంతా చూస్తున్నారు. రాష్ట్ర పరిస్థితిపై మహానాడులో పూర్తిగా మాట్లాడతా." --నందమూరి బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.