ETV Bharat / city

బల్దియా పోరులో.. అనుచరగణం.. అందుకుంది ఫలం

author img

By

Published : Dec 7, 2020, 8:23 AM IST

‘కార్యకర్తలే మా పార్టీకి ప్రాణం. కష్టపడి పని చేస్తే ఉన్నత పదవులు లభిస్తాయి. మేం కూడా సామాన్య కార్యకర్తగానే జీవితాన్ని మొదలుపెట్టాం’ ఇలా వివిధ పార్టీల్లో ప్రముఖ నేతలు తరచూ చెప్పే మాటలు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇది చాలావరకు నిజమైంది.

activists-of-different-parties-won-as-corporators-in-ghmc-elections
బల్దియా పోరులో.. అనుచరగణం.. అందుకుంది ఫలం

బల్దియా ఎన్నికల్లో పార్టీని, స్థానిక ప్రజలను నమ్ముకుని ఉన్న కార్యకర్తలు కార్పొరేటర్లుగా విజయం సాధించారు. తెరాసలో కొత్తగా 26 కార్యకర్తలకు అవకాశం లభిస్తే.. 20 మందికి పైగా విజయం సాధించారు.

భాజపా విషయానికి వస్తే.. పార్టీ కార్యకర్తలే కాకుండా, పార్టీ అనుబంధ సంస్థలైన ఏబీవీపీ, ఆరెస్సెస్‌లోని వారూ గెలుపొందారు. ఈసారి పాతవారు నలుగురే పోటీ చేయగా.. ముగ్గురు విజయం సాధించారు. గెలుపొందిన మొత్తం 48 మందిలో ఈ ముగ్గురితోపాటు గతంలో పలుమార్లు పోటీ చేసిన వారు 15 మంది వరకు ఉన్నారు. వివిధ పార్టీల నుంచి వచ్చిన వారు ఐదుగురున్నారు. ఇక మిగతావారంతా కార్యకర్తలే.

ఎంఐఎంలో కొత్తవారికి 14 మందికి అవకాశం కల్పించారు. ఇందులో 11 మంది విజయం సాధించారు. ఏఎస్‌రావునగర్, ఉప్పల్‌ డివిజన్లలో విజయం సాధించిన సింగిరెడ్డి శిరీషరెడ్డి, రజితా పరమేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి చెందినవారే.

జీహెచ్‌ఎంసీ ఫలితాల్లో అధిక సిట్టింగ్‌ స్థానాల్లో అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. గతంలో 99 స్థానాలను గెలుపొందిన తెరాస ఈ సారి ఎన్నికల్లో దాదాపు 44 డివిజన్లు కోల్పోయింది. ఆయా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయ బావుటా ఎగరవేసింది. ఆ పార్టీ నుంచి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించినా సునాయాసంగా గెలుపొందారు. స్థానిక అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత భాజపాకు బాగా కలిసివచ్చింది. ఇక గెలుపే లక్ష్యంగా తెరాస సిట్టింగ్‌ కార్పొరేటర్లను పక్కనపెట్టి పలువురికి కొత్తవారికి అవకాశం కల్పించింది. ఇది ఆ పార్టీకి చాలాచోట్ల కలిసొచ్చింది. ఒకటి, రెండుచోట్ల మినహా మిగిలిన డివిజన్లలో సదరు అభ్యర్థులు విజయకేతనం ఎగరేశారు.

* చిలుకానగర్‌లో గోపు సరస్వతి స్థానంలో బన్నాల గీతను బరిలోకి దించగా ఆమె గెలుపొందారు.

* హెచ్‌బీ కాలనీలో గొల్లూరి అంజయ్య స్థానంలో ప్రభుదాస్‌కు టికెట్‌ కేటాయించగా ఆయన విజయం సాధించారు.

* సోమాజిగూడలో సిట్టింగ్‌ అభ్యర్థి ఎ.విజయలక్ష్మి స్థానంలో వనం సంగీతా యాదవ్‌ను బరిలోకి దించగా.. ఆమె విజయబావుటా ఎగరేశారు.

* వెంగళరావునగర్‌ సిట్టింగ్‌ కార్పొరేటర్‌ కిలారీ మనోహర్‌ భాజపా చేరారు. అక్కడ తెరాస దేదీప్యరావుకు అవకాశమివ్వగా.. ఆమె గెలుపొందారు.

* బాలానగర్‌లో నరేందర్‌ ఆచార్య స్థానంలో టికెట్‌ దక్కించుకున్న ఆవుల రవీందర్‌రెడ్డి విజయం సాధించారు.

* ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ డివిజన్‌లో ఆకుల నర్సింగరావు స్థానంలో ప్రేమ్‌కుమార్‌కు అవకాశమిచ్చారు. విజయం దక్కింది.

* గౌతంనగర్‌లో శిరీషారెడ్డి స్థానంలో మేకల సునీతా యాదవ్‌ను పోటీ చేయించగా..ఆమె గెలుపొందారు.

* తార్నాక సిట్టింగ్‌ కార్పొరేటర్‌ ఆలకుంట్ల సరస్వతిని పక్కన పెట్టి.. ఆమె స్థానంలో ఎం.శ్రీలతకు టికెట్‌ ఇచ్చారు. ఆమె విజయం సాధించారు.

* ఉప్పల్‌ సిట్టింగ్‌ కార్పొరేటర్‌ మేకల అనలారెడ్డిని పక్కనపెట్టి శాలినికి అవకాశమిచ్చారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపొందారు.

ఆయా డివిజన్లలో..

* యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్‌ డివిజన్లలో కార్పొరేటర్లుగా గెలిచిన రాజ్‌కుమార్‌ పటేల్, దేదీప్య.. తెరాస ముఖ్య కార్యకర్తలు.

* మూసాపేట భాజపా విజేత మహేందర్‌ ఆరెస్సెస్‌ కార్యకర్త, సమాజ సేవకుడు.

* రాంనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఎన్నికైన రవిచారి బీజేవైఎం కార్యదర్శి. భాజపా కార్యకర్త.

* గడ్డిఅన్నారం, చైతన్యపురి డివిజన్ల నుంచి కార్పొరేటర్లుగా ఎన్నికైన ప్రేమ్‌మహేశ్వరరెడ్డి, రంగనరసింహగుప్తా ఆరెస్సెస్‌ కార్యకర్తలు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.