ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిపై తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఏపీ ఎమ్మెల్యే మెరుగు నాగార్జున తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలి వైకుంఠపురంలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని వేమూరు ఎమ్మెల్యే నాగార్జున దర్శించుకున్నారు. తన కుటుంబం కరోనా నుంచి కోలుకున్న సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని.. తలనీలాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ మంత్రులు తమ అధిష్ఠానానికి తెలిసి మాట్లాడుతున్నారో లేక రాజకీయ స్వలాభం కోసం మాట్లాడుతున్నారో గానీ.. తమ వ్యాఖ్యలను పునఃపరిశీలించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అక్కడ కూడా తమ నాయకుల విగ్రహాలు ఉన్నాయని... దమ్ముంటే ఆ విగ్రహాలపై చేయి వేసి చూడాలని సవాల్ విసిరారు.
ఇదీ చదవండి: CM KCR: 'ప్రతి జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర ఛాంబర్ ఏర్పాటు చేయాలి'