ETV Bharat / city

ఆ విగ్రహాలపై చేయి వేయగలరా.. మంత్రులకు ఏపీ ఎమ్మెల్యే సవాల్

author img

By

Published : Jun 26, 2021, 7:53 PM IST

తెలంగాణలోనూ తమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు ఉన్నాయని.. తెలంగాణ మంత్రులకు దమ్ముంటే ఆ విగ్రహాలను టచ్ చేసి చూడండని ఏపీ ఎమ్మెల్యే మెరుగు నాగార్జున సవాల్ విసిరారు. శనివారం ఆయన తెనాలి వైకుంఠపురంలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ap mla fired on telangana ministers
మంత్రులకు ఏపీ ఎమ్మెల్యే సవాల్

ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిపై తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఏపీ ఎమ్మెల్యే మెరుగు నాగార్జున తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తెనాలి వైకుంఠపురంలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని వేమూరు ఎమ్మెల్యే నాగార్జున దర్శించుకున్నారు. తన కుటుంబం కరోనా నుంచి కోలుకున్న సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని.. తలనీలాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ మంత్రులు తమ అధిష్ఠానానికి తెలిసి మాట్లాడుతున్నారో లేక రాజకీయ స్వలాభం కోసం మాట్లాడుతున్నారో గానీ.. తమ వ్యాఖ్యలను పునఃపరిశీలించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అక్కడ కూడా తమ నాయకుల విగ్రహాలు ఉన్నాయని... దమ్ముంటే ఆ విగ్రహాలపై చేయి వేసి చూడాలని సవాల్ విసిరారు.

ఇదీ చదవండి: CM KCR: 'ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో రాష్ట్ర ఛాంబర్‌ ఏర్పాటు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.