సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలోని దేవీనగర్లో ఉన్న పోచమ్మ ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రూ.9 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఆలయ ముఖద్వార నిర్మాణ పనులను మంత్రి శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, ఏసూరి మహేశ్, దేవీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి అశోక్ గౌడ్, అరుణ్ గౌడ్, సత్యనారాయణ, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆదాయం లేని హల్ట్ స్టేషన్ల తాత్కాలిక మూసివేత : ద.మ. రైల్వే