ETV Bharat / city

'ఎండాకాలంలో ఏ ఒక్క గిరిజన ఆవాసం తాగునీటి కోసం ఇబ్బంది పడొద్దు'

author img

By

Published : Apr 30, 2022, 5:22 AM IST

minister satyavathi rathod held webinar on drinking water problems in summer at tribal areas
minister satyavathi rathod held webinar on drinking water problems in summer at tribal areas

ఎండాకాలంలో మారుమూల, సుదూర ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాల్లో తాగునీటి వసతులపై మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్​లోని సంక్షేమ భవన్ నుంచి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, ఉన్నతాధికారులతో కలిసి ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు, మిషన్ భగీరథ అధికారులతో వెబినార్ నిర్వహించారు.

ఎండాకాలంలో ఏ ఒక్క గిరిజన ఆవాసం కూడా తాగునీటి కోసం ఇబ్బంది పడవద్దని.. అందుకు కావల్సిన అన్ని వసతులు వెంటనే కల్పించాలని మంత్రి సత్యవతి రాఠోడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎండాకాలంలో మారుమూల, సుదూర ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాల్లో తాగునీటి వసతులపై హైదరాబాద్​లోని సంక్షేమ భవన్ నుంచి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, ఉన్నతాధికారులతో కలిసి ఐటీడీఏల ప్రాజెక్టు అధికారులు, మిషన్ భగీరథ అధికారులతో వెబినార్ నిర్వహించారు. తెలంగాణ రాకముందు గ్రామాలకు తాగునీటి కొరత ఉండేదని.. గిరిజన గ్రామాల గోస చెప్పేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ మిషన్ భగీరథ తెచ్చాక దాని ద్వారా 99 శాతం గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. ఆగిపోయిన ఆ ఒక్క శాతం సుదూర ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాలే అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మిషన్ భగీరథ ఇబ్బందులున్నవి 105 ఆవాసాలు మాత్రమే అని... వీటిల్లో కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉండడం వల్ల అక్కడ కరెంటు లేక తాగునీటి సమస్య ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతి గిరిజన ఆవాసానికి 3 ఫేజ్ కరెంటు ఇవ్వాలని నిర్ణయించారని.. కరెంటు లేనిచోట సోలార్ ద్వారా విద్యుత్ అందించాలన్నారు. తాగునీటి వసతి లేని గిరిజన ఆవాసాలు ఉండకూడదని... ముఖ్యంగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేయాలన్నారు. మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకుని స్థానికంగా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలన్నారు. లేనిపక్షంలో ప్రభుత్వం దృష్టికి వెంటనే తీసుకొచ్చి పరిష్కరించాలని సూచించారు.

"ఒక మహిళ ఆస్పత్రి నుంచి డెలివరీ అయి 10 మైళ్లు నడుచుకుంటూ వెళ్లిందని వార్త వచ్చింది. ఈ పరిస్థితి రావడం దురదృష్టకరం. ప్రసవం అయిన తర్వాత తల్లీబిడ్డను ఇంటికి చేర్చేందుకు అమ్మఒడి వాహనాలు పెట్టాం. అయినా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది. ఈ ఘటనపై విచారించి, తగిన చర్యలు చేపట్టాలి. ఎవరైనా అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగితే వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలి. బిందెలతో ఏ ఒక్కరు రోడ్డెక్కడం కనిపించవదు. అవసరమైన చోట్లలో బోర్లు వేయాలి. ట్యాంకర్లతో నీరు అందించండి." - సత్యవతి రాఠోడ్​, మంత్రి

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.