Harish Rao On omicron: 'ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు బూస్టర్​ డోస్​ కోసం కేంద్రానికి లేఖ రాశాం'

author img

By

Published : Dec 24, 2021, 5:51 AM IST

Harish Rao, హరీశ్​రావు

Harish Rao On omicron: ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు తెలిపారు. జిల్లాకో మెడికల్‌ కళాశాల పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. హైదరాబాద్‌ నలుమూలల 4 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు సహా గాంధీ, నిలోఫర్‌, ఉస్మానియాను బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.

Harish Rao On omicron: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందించటమే ప్రధాన లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం పెంపునకు కఠిన చర్యలు అమలుచేస్తామని తెలిపారు. భాగ్యనగరిలో నలువైపులా సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటుచేసి అందరికీ మెరుగైనసేవలు అందిస్తామని తెలిపారు. పల్లె దవాఖానాలను అభివృద్ధి చేస్తామని.. తద్వారా గ్రామీణ వైద్యానికి ఊతమిస్తామన్నారు. ఈ దఫా ప్రభుత్వం వైద్యరంగంపై ప్రత్యేక దృష్టిసారిస్తుందంటున్న మంత్రి హరీశ్​ రావుతో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

Harish Rao On omicron: 'ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు బూస్టర్​ డోస్​ కోసం కేంద్రానికి లేఖ రాశాం'

ఇదీచూడండి: Minister Harish on HC: కరోనా ఆంక్షలు విధించాలన్న హైకోర్టు ఆదేశంపై స్పందించిన హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.