ETV Bharat / city

గ్రూప్‌-1, 2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేయడం సరికాదు: కోదండరాం

author img

By

Published : Apr 13, 2022, 4:34 PM IST

Kodandaram
కోదండరాం

Kodandaram: గ్రూప్‌-1, 2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేయడం సరికాదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలన్నారు. రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారం కోసమే 111 జీవోను ఎత్తివేస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టిన కోదండరాం.. భవిష్యత్ కార్యాచరణపై హైదరాబాద్‌లోని తెజస కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు.

Kodandaram: తెరాస ప్రభుత్వం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు ఉరివేసి.. ప్రైవేటు యూనివర్సిటీలకు హారతి పడుతోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. ప్రభుత్వ యూనివర్సిటీలలో ఉద్యోగ ఖాళీల భర్తీతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెజస కార్యాలయంలో రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలపై పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు.

'గ్రూప్‌-1, 2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తేయడం సరికాదు. గ్రూప్-1 కు సంబంధించిన విషయంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకోకుండా... కొన్ని విషయాలను టీఎస్​పీఎస్​సీకి వదిలివేయాలి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి. మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలన్నీ ప్రజావ్యతిరేకమైనవి. జీవో 111 ఎత్తివేతతో పాతబస్తీకి తీవ్రంగా నష్టం కలుగుతుంది. దానిపై పాతబస్తీలో విస్తృతంగా ప్రచారం చేస్తాం. జంట జలాశయాలు, మూసీ గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.'

-ఆచార్య కోదండరాం, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే 111 జీవోను ఎత్తివేస్తున్నారని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ఒకవైపు కేంద్రం పెట్రోల్‌, డీజిల్ ధరలు పెంచుతుంటే... రాష్ట్ర ప్రభుత్వమేమో విద్యుత్ ఛార్జీలు పెంచిందని ఆరోపించారు.

గ్రూప్‌-1, 2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేయడం సరికాదు: కోదండరాం

ఇదీ చదవండి:యాసంగి ధాన్యం కొంటే.. రాష్ట్రానికి ఎంత భారమంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.