KTR: డబ్ల్యూఈఎఫ్​ నుంచి కేటీఆర్​కు ఆహ్వానం

author img

By

Published : Sep 19, 2021, 1:55 PM IST

Updated : Sep 19, 2021, 2:18 PM IST

KTR

13:52 September 19

KTR: డబ్ల్యూఈఎఫ్​ నుంచి కేటీఆర్​కు ఆహ్వానం

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​కు మరో అరుదైన గౌరవం దక్కింది. జనవరి 17 నుంచి 21వ తేదీ వరకు స్విట్జర్​లాండ్​లోని దావోస్​లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం నిర్వహించే వార్షిక సదస్సు-2022 కు హాజరుకావాల్సిందిగా డబ్య్లూఈఎఫ్​ నుంచి కేటీఆర్​కు ఆహ్వానం అందింది. కొవిడ్ నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోవటానికి సాంకేతికతను వినియోగిస్తూ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ చూపిన విజన్​కు గుర్తింపుగా ఆయన్ను ఆహ్వానించామని వరల్డ్ ఎకనమిక్ ఫోరం వెల్లడించింది. 

ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని టెక్నాలజీకి రారాజుగా మంత్రి కేటీఆర్ నిలిపారని..  ప్రపంచ ఆర్ధిక వేదిక అధ్యక్షుడు బోర్గ్ బ్రెండె ప్రశంసించారు. డబ్య్లూఈఎఫ్​ సదస్సుకు తనను ఆహ్వానించటం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఆహ్వానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఐటీ, పరిశ్రమలు, ఆవిష్కరణ రంగాల్లో కనబరుస్తోన్న ప్రతిభకు దక్కిన గౌరవంగా భావిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భాన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అనుకూల విధానాలు ప్రపంచ వేదిక వద్ద ప్రస్తావించి గ్లోబల్ కంపెనీల పెట్టుబడుల ఆకర్షించేందుుకు ఒక అవకాశంగా మలుచుకుంటామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.  

ఇదీ చదవండి: Laddu: గచ్చిబౌలి గణేశ్ లడ్డూకి రికార్డు రేట్... ఎన్ని లక్షలంటే?

Last Updated :Sep 19, 2021, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.