ETV Bharat / city

ELEPHANTS: పలమనేరులో ఏనుగుల గుంపు హల్​చల్

author img

By

Published : Jun 23, 2021, 2:43 PM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగులు సంచరించాయి. 20పైగా ఉన్న ఏనుగుల గుంపు అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లో వచ్చాయి. విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది బాణసంచా పేల్చి ఆ ఏనుగులను అడవిలోకి తరిమారు.

group-of-elephants-roaming-in-palamaneru-chittoor-district
ELEPHANTS: పలమనేరులో ఏనుగుల గుంపు హల్​చల్

ఆంధ్ర ప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగులు హల్​చల్ చేశాయి. దాదాపు 20కి పైగా ఉన్న ఏనుగుల గుంపు పలమనేరు అటవీ ప్రాంతం నుంచి జనవాసాల్లోకి వచ్చాయి. ఏనుగుల గుంపు సంచరిస్తుందన్న సమాచారంతో పరిసర గ్రామాల్లోని ప్రజలు వాటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పట్టణంలోని రాధా బంగ్లా, బొమ్మ దొడ్డి చెరువు ప్రాంతాల్లో ఏనుగులు నివాసాల మధ్యలోకి వచ్చేశాయి. అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది బాణసంచా పేల్చి ఏనుగులను అడవిలోకి తరిమారు. నివాసాలకు సమీపానికి ఏనుగులు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఇదీ చదవండి: స్నాక్స్​ కోసం గోడ పగులగొట్టిన గజరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.