ETV Bharat / city

GRMB: ప్రాజెక్టుల వివరాలు కోరిన జీఆర్‌ఎంబీ ఉపసంఘం

author img

By

Published : Sep 20, 2021, 10:49 PM IST

Updated : Sep 20, 2021, 10:55 PM IST

GRMB
GRMB

22:33 September 20

GRMB: ప్రాజెక్టుల వివరాలు కోరిన జీఆర్‌ఎంబీ ఉపసంఘం

గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు మరోమారు చర్చించింది. జీఆర్ఎంబీ సభ్యకార్యదర్శి బీపీపాండే నేతృత్వంలో జరిగిన సమావేశంలో బోర్డు సభ్యులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు పాల్గొన్నారు. శుక్రవారం నాటి సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ జరిగింది. ప్రాజెక్టులు, పంప్ హౌస్​లు, ప్లాంట్లకు సంబంధించిన ఉద్యోగులు, సిబ్బంది వివరాలు వీలైనంత త్వరగా ఇవ్వాలని రెండు రాష్ట్రాలను ఉపసంఘం కోరింది. 

అక్టోబర్ 14వ తేదీ నుంచి గెజిట్ నోటిఫికేషన్​ను అమలు చేయాల్సి ఉన్నందున వీలైనంత త్వరగా వివరాలు అందించాలని సూచించింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలంగాణ అధికారులు ఉపసంఘానికి తెలిపారు. నిర్వహణ కోసం సిబ్బందులు, మౌలికవసతుల వివరాలు అందిస్తామని ఏపీ అధికారులు చెప్పారు.

అమలు ప్రక్రియ కోసం

కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియ కోసం ఇదివరకే గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన జీఆర్ఎంబీ(grmb) , కేఆర్ఎంబీ(KRMB) సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ స్థానంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.  బోర్డు మీటింగ్ మినిట్స్​తో పాటు ఉపసంఘాన్ని ప్రకటించారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి ఉపసంఘానికి కన్వీనర్​గా వ్యవహరిస్తారు. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై ఉపసంఘం ఎప్పటికప్పుడు చర్చించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

ఇదీ చదవండి : న్యాయస్థానంలో పరువునష్టం దావా దాఖలు చేశా: కేటీఆర్

Last Updated :Sep 20, 2021, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.