ETV Bharat / city

గిట్టుబాటు ధర లేక పంటను పారబోసిన రైతులు

author img

By

Published : Apr 16, 2020, 4:40 PM IST

corona effect on farmer
గిట్టుబాటు ధర లేక పంటను పారబోసిన రైతులు

లాక్​డౌన్ నిబంధన ఆంధ్రా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్​కు తీసుకొచ్చిన వంకాయలకు గిట్టుబాటు ధర లేక పారబోసిన సంఘటన విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో జరిగింది.

విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మార్కెట్​కు పరిసర ప్రాంతాల నుంచి రైతులు వంకాయలు తీసుకొచ్చారు. సరకు ఒక్కసారిగా మార్కెట్‌కు చేరుకోగా.. ధరలు పతనమయ్యాయి. కనీసం కోతలకు పెట్టిన డబ్బులు కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 25 కేజీల ట్రేను రూ.50కు అడుగుతున్నారని వాపోయారు. ఆగ్రహానికి గురైన అన్నదాతలు వంకాయలను రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.

ఇదీచదవండి. 'ఆధునిక సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.