ETV Bharat / city

ఈఎస్​ఐ కేసు: దేవికారాణితోపాటు మరో ఎనిమిది మంది అరెస్ట్​

author img

By

Published : Sep 4, 2020, 12:18 PM IST

Updated : Sep 4, 2020, 12:46 PM IST

ఐఎంఎస్ కుంభకోణంలో నిందితులు కోర్టుకు హాజరుకానున్నారు. నకిలీ బిల్లులతో డొల్ల కంపెనీల ద్వారా సుమారు 6.5 కోట్లు కాజేసినట్లు గుర్తించారు అనిశా అధికారులు. దేవికారాణితో పాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్​ చేశారు.

esi case update
ఈఎస్​ఐ కేసు: దేవికారాణితోపాటు మరో ఎనిమిది మంది అరెస్ట్​

ఐఎంఎస్ కుంభకోణంలో మాజీ సంచాలకురాలు దేవికారాణితోపాటు మరో ఎనిమిది మందిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. అవసరం లేకున్నా ఔషధాలు కొనుగోలు చేయడం, మార్కెట్ రేటు కంటే ఎక్కువ చెల్లించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించినట్లు అనిశా అధికారుల దర్యాప్తులో తేలింది.

దాదాపు రూ.6.5 కోట్లు అవినీతికి పాల్పడినట్లు తేలడంతో భీమా వైద్య సేవల విభాగానికి చెందిన అధికారులు.. దేవికారాణి, కల్వకుంట్ల పద్మ, వసంత ఇందిర, ఓమ్నీ మెడి నిర్వాహకుడు బాబ్జీతో పాటు మరికొందరిని అరెస్టు చేశారు.

నాంపల్లిలోని అనిశా కార్యాలయంలో వీరిని విచారిస్తున్నారు. ఇవాళ సాయంత్రం న్యాయస్థానంలో హాజరు పరచనున్నారు.

ఇవీచూడండి: ఈఎస్​ఐ కుంభకోణం: తీగ లాగితే డొంక కదులుతోంది!

Last Updated :Sep 4, 2020, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.