ETV Bharat / city

రాష్ట్రంలో మరో 146 కరోనా కేసులు, 2 మరణాలు

author img

By

Published : Feb 14, 2021, 10:21 AM IST

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. తాజాగా 146 మంది వైరస్ బారిన పడ్డారు. మహమ్మారి సోకి మరో ఇద్దరు మృతి చెందారు.

corona cases and deaths in telangana today
తెలంగాణలో మరో 146 కరోనా కేసులు, 2 మరణాలు

తెలంగాణలో మరో 146 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,96,574 మందికి మహమ్మారి సోకింది.

వైరస్ బారిన పడి ఇప్పటివరకు రాష్ట్రంలో 1,616 మంది మరణించారు. మరో 177 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు మహమ్మారి నుంచి బయటపడిన వారి సంఖ్య 2,93,210కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 1,748 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 749 మంది బాధితులు ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 29 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.