సికింద్రాబాద్ సీతాఫల్మండిలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలకు వేర్వేరు భవనాలు లేకపోవడం వల్ల షిఫ్ట్ విధానం ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. దీనివల్ల తాము తరగతులు నష్టపోతున్నామని విద్యార్థులు ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు గదుల్లో 600 మంది విద్యార్థులకు తరగతులు నిర్వహించడం ఇబ్బందిగా ఉందని వాపోయారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి, వెంటనే నూతన భవనాలు నిర్మించాలని లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
- ఇదీ చూడండి : వాన పడింది... లోటు తగ్గింది...