ETV Bharat / city

"ధరణి" రూప కల్పనపై నేడు కేసీఆర్ కీలక సమీక్ష

author img

By

Published : Sep 21, 2020, 3:54 PM IST

Updated : Sep 22, 2020, 4:57 AM IST

cm kcr
cm kcr

15:52 September 21

ధరణి పోర్టల్ రూపకల్పనపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష

రెవెన్యూ రికార్డుల నిర్వహణ కోసం ధరణి పోర్టల్ రూపకల్పన గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సమీక్ష నిర్వహించనున్నారు. దేశంలోనే మొదటి సారిగా, విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పూర్తి పారదర్శకంగా నిర్వహించేలా ‘ధరణి‘ పోర్టల్ రూపకల్పన జరగాలన్నది సీఎం ఆకాంక్ష.  

కొత్త రెవెన్యూ విధానం నేపథ్యంలో అందుకు అనుగుణంగా కొంతకాలంగా అధికారులు విస్తృత కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి ప్రగతి భవన్​లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సమగ్ర సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని అధికారులను సీఎం ఆదేశించారు.  

Last Updated : Sep 22, 2020, 4:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.