ETV Bharat / city

'రైల్వేశాఖను ప్రైవేటీకరిస్తే ఊరుకోం'

author img

By

Published : Oct 28, 2020, 12:23 PM IST

railway employees
'రైల్వేశాఖను ప్రైవేటీకరిస్తే ఊరుకోం'

రైల్వే ప్రైవేటీకరణ దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని రైల్వే యూనియన్​ నాయకుడు భరణి ఆరోపించారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్​ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య కృషి వల్లనే బోనస్​లు ప్రకటించిందంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘం ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య కృషి వల్లనే కేంద్ర ప్రభుత్వం బోనస్​లు ప్రకటించిందని రైల్వే యూనియన్ నాయకుడు భరణి అన్నారు. ఈ సందర్భంగా కార్మిక నేతలతో కలిసి.. మర్రి రాఘవయ్య చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా కేంద్ర ప్రభుత్వం బోనస్​లు ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయించినా.. రాఘవయ్య కృషితో కేంద్ర ప్రభుత్వం బోనస్​లు ప్రకటించినట్లు తెలిపారు. రైల్వే ప్రైవేటీకరణ దిశగా.. కేంద్రం పావులు కదుపుతోందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇవీచూడండి: భారత సంస్థ 'జీహెచ్​ఈ'కి ప్రతిష్ఠాత్మక యూఎన్​ అవార్డ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.