ETV Bharat / city

ఈనెల 17న తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం

author img

By

Published : Feb 12, 2022, 11:31 AM IST

Updated : Feb 12, 2022, 12:18 PM IST

ఏపీ విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం
ఏపీ విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం

11:27 February 12

తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 8న జరిగిన సమావేశంలో కమిటీ ఏర్పాటుకు కేంద్ర హోంశాఖ కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ ఆశిష్‌ కుమార్, ఏపీ నుంచి ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ఈ నెల 17న ఉదయం 11గంటలకు కమిటీ తొలి భేటీ వర్చువల్‌గా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, 10లోని ఆస్తుల పంపకాలపైనా భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థిక పరమైన అంశాలూ చర్చకు రానున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. సమావేశంలో ఏ అంశాలు చర్చించాలన్న దానిపై కేంద్ర హోంశాఖ.. అధికారులకు ఇప్పటికే సమాచారం అందించింది.

సమావేశంలో చర్చలు జరిగే ప్రధాన అంశాలు..

1. ఏపీ ఫైనాన్స్‌ కొర్పొరేషన్‌ విభజన

2. విద్యుత్ వినియోగ అంశాలు

3. పన్ను అంశాల్లో సవరణలు

4. ఏపీఎస్‌సీఎస్‌సీఎల్‌, టీఎస్‌సీఎస్‌సీఎల్‌ సంస్థలో నగదు అంశం

5. వనరుల సర్దుబాటు

6. 7 వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి నిధుల అంశం

7. ప్రత్యేక హోదా

8. పన్ను ప్రోత్సాహకాలు

9. వనరుల వ్యత్యాసం

Last Updated :Feb 12, 2022, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.