ETV Bharat / city

ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం

author img

By

Published : Jan 7, 2021, 5:59 AM IST

ఏపీలోని ప్రకాశం జిల్లా మార్టూరు వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. లారీని వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

ఏపీలో ఘోర  రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం
ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం

ఏపీలోని ప్రకాశం జిల్లాలోని మార్టూరు వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

మృతులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు. తిరుమల నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పోలీసులు, హైవే సిబ్బంది ఇక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి :కంటైనర్ బోల్తా... డ్రైవర్​కు తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.