ETV Bharat / city

బ్రహ్మణవెల్లంల నుంచి హైదరాబాద్​కు ఎంపీ కోమటిరెడ్డి పాదయాత్ర

author img

By

Published : Feb 13, 2021, 7:19 PM IST

బ్రహ్మణ వెల్లెంల, ఎస్ఎల్​బీసీ పూర్తి చేయాలనే డిమాండ్​తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు అనుమతి ఇవ్వాలని... ఎస్​ఈసీ, ఎస్పీకి లేఖ రాశారు. బ్రహ్మణవెల్లెంల నుంచి హైదరాబాద్​కు పాదయాత్ర చేపట్టనున్నారు.

bhuvanagiri mp komatireddy venkatreddy padayathra brahmanavellemla to hyderabad
బ్రహ్మణవెల్లంల నుంచి హైదరాబాద్​కు ఎంపీ కోమటిరెడ్డి పాదయాత్ర

ప్రాజెక్టుల సాధన పేరుతో పాదయాత్ర చేయనున్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 20నుంచి 26వ వరకు నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల నుంచి హైదరాబాద్ ఈఎన్‌సీ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టనున్నట్టు వివరించారు. ఈ మేరకు అనుమతి కోరుతూ ఎన్నికల కమిషన్‌, ఎస్‌పీకి లేఖ రాసినట్లు ఎంపీ స్పష్టం చేశారు. వేలాది మందితో 120 కిలోమీట‌ర్లు... 6 రోజులుపాటు పాద‌యాత్ర ఉంటుందని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ మీద ప్రేమ ఉన్నట్లు వ్యవహారిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో 2008లో ప్రారంభించిన బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుకు రూ.100కోట్లు ఇస్తే పూర్తవుతుందన్నారు. ఇప్పటికే ఎస్​ఎల్​బీసీ సొరంగమార్గానికి రూ.1300 కోట్లు ఖర్చు చేశామని... మరో వెయ్యి కోట్లు ఇస్తే పూర్తి అవుతుందని వివరించారు. సొరంగమార్గం ఉంటే ఏపీకి జగన్​ నీళ్లు తీసుకవెళ్లేవారు కాదని... కాంగ్రెస్​కు, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి పేరు వస్తుందనే ఆ రెండు ప్రాజెక్టులను పెండింగ్​లో పెట్టారని ఆరోపించారు. శాంతియుతంగా చేసే పాదయాత్రకు రైతులు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు.

ఇదీ చూడండి: షర్మిల ఖమ్మం పర్యటన వాయిదా

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.