తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సరైన సాంకేతికత, ముందు చూపు లేకుండా నిర్మించారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మానేరుకు వరద వస్తే అన్నారం బ్యారేజీ నుంచి 3 టీఎంసీల నీటిని వృథాగా వదిలేయడం చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం కాదు... ఎత్తిదించే పథకం అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ .. మంత్రులు, ఇంజినీర్లు చెప్పిన మాట వినకపోవడం వల్లే ఈ నష్టం వచ్చిందని, ప్రాజెక్టు పేరిట 80 వేల కోట్ల రూపాయల నిధులు వృథా చేశారని విమర్శించారు.
- ఇదీ చూడండి : దుబాయ్లో జాక్పాట్ కొట్టిన తెలుగోడు..!