ETV Bharat / city

ప్రగతిభవన్‌ ముట్టడికి మహిళా పీఈటీ అభ్యర్థుల యత్నం

author img

By

Published : Dec 7, 2020, 1:18 PM IST

Updated : Dec 7, 2020, 2:23 PM IST

పీఈటీ నియామకాలు వెంటనే చేపట్టకపోతే కారుణ్య మరణాలే శరణ్యమని పీఈటీ అభ్యర్థులు అన్నారు. ప్రగతి భవన్​ ముట్టడికి యత్నించిన వీరిని పోలీసులు అడ్డుకుని గోషామహల్​ స్టేడియానికి తరలించారు.

Attempt by female PET candidates to invade Pragati Bhavan
ప్రగతిభవన్‌ ముట్టడికి మహిళా పీఈటీ అభ్యర్థుల యత్నం

2018 నుంచి పీఈటీ ఫలితాలు ప్రకటించకుండా జాప్యం చేస్తున్నారని పీఈటీ మహిళా అభ్యర్థులు ప్రగతి భవన్​ వద్ద ఆందోళనకు దిగారు. ప్రగతిభవన్​ ముట్టడికి యత్నించిన వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం గోషామహల్​ స్టేడియానికి తరలించారు.

ప్రగతిభవన్‌ ముట్టడికి మహిళా పీఈటీ అభ్యర్థుల యత్నం

విజిల్​ శబ్ధాలతో క్యాంప్​ ఆఫీసు సమీపంలో నిరసన చేపట్టడం వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోర్టు పరిధిలో ఉన్న కేసుకు కౌంటర్ వేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మహిళా అభ్యర్థులు ఆరోపించారు. ఈ నిరసనలో వరంగల్, నాగర్ కర్నూల్, మహబూబ్​నగర్, ఖమ్మం, కరీంనగర్​ నుంచి మహిళా అభ్యర్థులు పాల్గొన్నారు.

Last Updated : Dec 7, 2020, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.