ETV Bharat / city

ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

author img

By

Published : Aug 7, 2020, 7:37 PM IST

Updated : Aug 7, 2020, 8:49 PM IST

ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

19:36 August 07

ఏపీలో 2 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

undefined

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రెండు లక్షలు దాటాయి. గత 24 గంటల్లో  కొత్తగా 10,171 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,04,065కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 84,654 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఒక్క రోజులో 7,594 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తంగా 1,17,569 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 62,938 నమూనాలు, ఇప్పటి వరకు 23,62,270 నమూనాలు పరీక్షించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

తాజాగా 89 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో పది మంది; అనంతపురం, గుంటూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున; తూర్పు గోదావరి, కడప, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు; కృష్ణా జిల్లాలో ఆరుగురు; కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు; శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున కరోనాతో మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1,842కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కర్నూలు  జిల్లా నుంచి 1,331 కేసులు, తూర్పు గోదావరి జిల్లా నుంచి 1,270 కేసులు, అనంతపురం జిల్లా నుంచి 1,100 కేసులు వచ్చాయి.

Last Updated : Aug 7, 2020, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.