ETV Bharat / city

Amaravati Farmers Meeting: అమరావతి రైతు సభకు రాజకీయ నేతలు.. హాజరయ్యేది వీరే..!

author img

By

Published : Dec 16, 2021, 5:11 PM IST

Amaravati Farmers Meeting: 'అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ' పేరిట.. తిరుపతిలో శుక్రవారం అమరావతి రైతులు బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. అమరావతి నినాదం.. ఎలుగెత్తి చాటేలా సభను తలపెట్టారు. ఈ భారీ బహిరంగ సభకు అన్ని రాజకీయపక్షాలనూ ఆహ్వానించారు. ఈ సభలో పాల్గొనేది ఎవరంటే..?

Amaravati Farmers Meeting: అమరావతి రైతు సభకు రాజకీయ నేతలు.. హాజరయ్యేది వీరే..!
Amaravati Farmers Meeting: అమరావతి రైతు సభకు రాజకీయ నేతలు.. హాజరయ్యేది వీరే..!

Amaravati Farmers Public Meeting: అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ పేరిట.. రేపు రాజధాని రైతులు తిరుపతిలో తలపెట్టిన బహిరంగ సభకు.. ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఏపీ సీఎం జగన్‌ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసి, రేపటికి రెండేళ్లవుతున్న సందర్భంగా ఈ సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తుళ్లూరు నుంచి తిరుమల వరకూ పాదయాత్ర పూర్తి చేసిన రైతులు.. రేపటి సభ కోసం ఎదురు చూస్తున్నారు. సమయం ఒక్కరోజు మాత్రమే ఉండటంతో ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు. ఈ ఉదయం ఐకాస నేతలు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమరావతి ఐకాస నేతలు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, రాయపాటి శైలజ, తెదేపా నేత పులివర్తి నాని పాల్గొన్నారు. రేపటి సభకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. సీపీఐ, జనసేన నాయకులు కూడా పాల్గొనే అవకాశముంది.

సభను విజయవంతం చేయాలి - భాజపా
BJP on Amaravati Farmers Public Meeting in Tirupati: తిరుపతి వేదికా తలపెట్టిన అమరావతి ఐకాస బహిరంగ సభను విజయవంతం చేయాలని భాజపా.. తమ పార్టీ శ్రేణులకు ఆదేశాలను జారీ చేసింది. పార్టీ తరపున కన్నా లక్ష్మీనారాయణతో పాటు రావెల కిషోర్​బాబు హాజరుకానున్నట్లు వెల్లడించింది.

అలర్లు సృష్టించాలని చూస్తున్నారు: అచ్చెన్నాయుడు

తిరుపతిలో అమరావతి పరిరక్షణ సభను విజయవంతం చేయాలి. సభ విజయవంతం చేయడంలో తెదేపా శ్రేణులు భాగం కావాలి. ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలన్నది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష. కొందరు వైకాపా సానుభూతిపరులు అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు. అభివృద్ధి చేతగాక ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం చేస్తున్నారు - అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

సీపీఐ నుంచి జాతీయ నాయకులు..
అమరావతి ఐకాస సభకు సీపీఐ పార్టీ నుంచి జాతీయ నాయకులు హాజరుకానున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతోపాటు అతుల్ కుమార్ అంజన్ పాల్గొననున్నారు. ఈ మేరకు సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు.

తిరుపతిలో అమరావతి ఐకాస సభను జయప్రదం చేయండి. సభలో సీపీఐ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలి. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తూ సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి' - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

20 ఎకరాల్లో ఏర్పాట్లు..
Amaravati agitation: దాదాపు 20ఎకరాలకు పైగా స్థలంలో సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వేదిక ఏర్పాటు చేయనున్నారు. వీవీఐపీ, వీఐపీ, మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చూసేవిధంగా వీలుగా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. సభకు ఎంత మంది వచ్చినా అందరూ భోజనం చేసేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నారావారిపల్లెలో అమరావతి రైతులు..

Amaravati Farmers Visit naravaripalli: తెదేపా అధినేత చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో అమరావతి రైతులు పర్యటించారు. రాజధాని రైతులకు గ్రామస్థులు హారతిపట్టి స్వాగతం పలికారు. చంద్రబాబు తల్లిదండ్రుల సమాధులతోపాటు.. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.

ఇదీ చదవండి:

Amaravati Padayatra: ఆంక్షలు ఎదురైనా సడలని సంకల్పం.. అకుంఠిత దీక్షతో యాత్ర పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.