ETV Bharat / city

నేడు ఏపీ రాజధాని గ్రామాల్లో సంపూర్ణ బంద్‌

author img

By

Published : Nov 1, 2020, 8:25 AM IST

నేడు ఏపీలోని రాజధాని గ్రామాల్లో సంపూర్ణ బంద్‌
నేడు ఏపీలోని రాజధాని గ్రామాల్లో సంపూర్ణ బంద్‌

ఏపీ రాజధాని గ్రామాల్లో ఆదివారం సంపూర్ణ బంద్​కు అమరావతి ఐకాస పిలుపునిచ్చింది. 'జైల్ భరో'లో పోలీసుల దాడికి నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఐకాస స్పష్టం చేసింది. 29 గ్రామాల్లో బంద్‌ను విజయవంతం చేయాలని కోరింది.

ఆంధ్రప్రదేశ్​లో రాజధాని గ్రామాల్లో అమరావతి పరిరక్షణ ఐకాస.. ఇవాళ బంద్​కు పిలుపునిచ్చింది. శనివారం నిర్వహించిన జైల్ భరోలో మహిళా రైతుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు, కృష్ణాయపాలెంలోని దళిత రైతులపై పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ రాజధాని గ్రామాల్లో సంపూర్ణ బంద్​ను పాటించనున్నట్లు ఐకాస కన్వీనరు పువ్వాడ సుధాకర్ తెలిపారు.

ఇదీచదవండి: మిస్సింగ్​.. వీళ్లంతా ఏమైపోతున్నారు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.