ETV Bharat / city

పసిబిడ్డను అంగడి బొమ్మను చేసిందా అమ్మ!

author img

By

Published : Sep 20, 2021, 8:49 AM IST

పిల్లలంటే ఇష్టపడని తల్లి ఉండదు. పిల్లల కోసం పస్తులుండైనా వారి కడుపు నింపుతుంది. వారికేదైనా చిన్న గాయమైతే తాను తల్లడిల్లుతుంది. కన్నబిడ్డకు కష్టం రాకుండా అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డల క్షేమమే తన క్షేమంగా వారి కోసం ప్రతిక్షణం తపిస్తుంది. అంత గొప్ప అమ్మ స్థానంలో ఉన్న ఓ మహిళ తన అవసరాల కోసం కన్నబిడ్డను వాడుకుంటోంది. మత్తులో తూలేందుకు వినాయక నిమజ్జనం సాక్షిగా చంటిబిడ్డను అంగడిబొమ్మను చేస్తోంది.

పసిబిడ్డను అంగడి బొమ్మను చేసిందా అమ్మ
పసిబిడ్డను అంగడి బొమ్మను చేసిందా అమ్మ

సృష్టిలో అమ్మ స్థానం కంటే గొప్పది లేదు. తల్లి ప్రేమను మించింది ఏదీ లేదు. నవమోసాలు మోసిన తల్లి బిడ్డ పుట్టిన క్షణం నుంచి అపురూపంగా చూసుకుంటుంది. పసిబిడ్డ ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డేస్తుంది. తన చిన్నారికి ఏ చిన్ని కష్టం రాకుండా కాపాడుకుంటుంది. బిడ్డ క్షేమం కోసం ప్రతిక్షణం తపిస్తుంది. తన పిల్లలు ఆనందంగా ఉండాలని అనుక్షణం శ్రమిస్తుంది. బిడ్డకు ఏం కావాలో అడక్కుండానే ముందే తెలుసుకుని అన్నీ ఇస్తుంది. అంత మహోన్నతమైన స్థానం కలిగిన అమ్మతనానికి మచ్చ తెచ్చింది ఓ మహిళ. కంటికి రెప్పలా చూస్కోవాల్సిన కన్నబిడ్డను అంగట్లో బొమ్మను చేసింది. తన అవసరాల కోసం చంటిపాపను వాడుకుంటోంది.

2021లో: అదే ప్రాంతంలో మళ్లీ ఆ మహిళే..

చేతికి గాయం మరకలు.. నీరసించిన స్థితిలో పడిపోయి ఉన్న తల్లి.. పక్కనే బిక్కచూపులు చూస్తూ ఓ చిన్నారి. ఈ చిత్రం చూసిన ఎవరికైనా కళ్లుచెమర్చక మానదు. ఇది ఆ ఇద్దరి విధిరాత కాదు. మత్తు మహమ్మారి రాసిన ఓ 'వీధి'రాత. తన అలవాట్లు తీర్చుకునేందుకు ఈ చిన్నారిని అంగడి బొమ్మను చేసిందా అమ్మ! రెండేళ్లుగా ఆ చిన్నారిని ఇలాగే వాడుకుంటోందా తల్లి. ఏటా ట్యాంక్‌బండ్‌పై గణేశ్‌ నిమజ్జనాల సమయంలో ఇలాగే దర్శనమిస్తోంది. 2019 సెప్టెంబరు 12న నిమజ్జనాల వేళ ఆమెపై పలు ఫిర్యాదులొస్తే అదుపులోని తీసుకొని సంరక్షణ కేంద్రానికి తరలించారు. రెండేళ్ల తర్వాత ఆదివారం మళ్లీ దర్శనమిచ్చింది. ఆమె చేతిపై ఉన్న మరకలు పెయింటింగ్‌.

ఇవీ చదవండి :

డబ్బులు ఇవ్వాలంటూ కుమారుడి వేధింపులు.. ఠాణాకొచ్చిన వృద్ధురాలు

'గూగుల్ తల్లి'తో కాదు...అమ్మతోనే పంచుకుందాం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.