ETV Bharat / city

AP Corona Cases: ఏపీలో కొత్తగా 3,040 కరోనా కేసులు

author img

By

Published : Jul 9, 2021, 8:53 PM IST

ఏపీలో తాజాగా మూడు వేల 40 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి 14 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో నాలుగు వేల 576 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 30,300 క్రీయాశీల కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు.

3040-new-more-corona-cases-reported-in-andhrapradesh
3040-new-more-corona-cases-reported-in-andhrapradesh

ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,00,103 పరీక్షలు నిర్వహించగా.. 3,040 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,17,253 మంది వైరస్‌ బారినపడినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 14 మంది బాధితులు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 12,960కి చేరింది.

  • #COVIDUpdates: 09/07/2021, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,14,358 పాజిటివ్ కేసు లకు గాను
    *18,71,098 మంది డిశ్చార్జ్ కాగా
    *12,960 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 30,300#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/3CuKfDGlDb

    — ArogyaAndhra (@ArogyaAndhra) July 9, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

24 గంటల వ్యవధిలో 4,576 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,73,993కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​లో 30,300 యాక్టివ్‌ కేసులున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,27,99,245 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.

ఇదీ చదవండి: JAGAN: ఏపీ సీఎం జగన్​ బ్యాటింగ్​.. ఎంపీ అవినాష్​ బౌలింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.