ETV Bharat / city

AP Corona: ఏపీలో కొత్తగా 1,578 కేసులు నమోదు

author img

By

Published : Jul 12, 2021, 7:10 PM IST

ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. తాజాగా మరో 1,578 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 305 మందికి కరోనా సోకగా చిత్తూరు జిల్లాలో 257, నెల్లూరు జిల్లాలో 179, ప్రకాశం జిల్లాలో 173 కరోనా కేసులు బయటపడ్డాయి.

new
కేసులు

ఏపీలో ఒకరోజు వ్యవధిలో 62 వేల 657 శాంపిల్స్ పరీక్షించగా 15 వందల 78 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 305 మందికి కరోనా సోకగా చిత్తూరు జిల్లాలో 257, నెల్లూరు జిల్లాలో 179, ప్రకాశం జిల్లాలో 173 కరోనా కేసులు బయటపడ్డాయి.

కరోనాతో మరో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. మరో 3 వేల 41 మంది కొవిడ్ నుంచి కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 27 వేల 195 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

1,578 new corona cases
కొత్తగా 1,578 కేసులు నమోదు

ఇదీ చదవండి: KTR: 'తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేది తెరాస మాత్రమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.