ETV Bharat / city

AP corona cases today: ఏపీలో కరోనా ఉద్ధృతి.. 14 వేలకు పైగా కొత్త కేసులు

author img

By

Published : Jan 23, 2022, 6:27 PM IST

AP corona cases today: ఏపీలో కొవిడ్​ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 14,440 కేసులు నమోదు కాగా.. మహమ్మారి బారిన పడి నలుగురు మరణించారు.

AP corona cases today
ఏపీలో కరోనా కేసులు

ap corona cases today: ఆంధ్రప్రదేశ్​లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకూ కొవిడ్​ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 46,650 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 14,440 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. వైరస్ సోకి తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. కరోనా బారి నుంచి తాజాగా 3,969 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 83,610 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

అత్యధికంగా విశాఖ జిల్లాలో 2,258, అనంతపురంలో 1534, గుంటూరు 1458, ప్రకాశం 1399, కర్నూలు 1238, చిత్తూరు 1198, తూర్పుగోదావరి 1012, నెల్లూరు, 1103, కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో పోరాడుతూ ఇప్పటివరకు 14,542 మంది మృతి చెందారు.

  • #COVIDUpdates: 23/01/2022, 10:00 AM
    రాష్ట్రం లోని నమోదైన మొత్తం 21,77,739 పాజిటివ్ కేసు లకు గాను
    *20,79,587 మంది డిశ్చార్జ్ కాగా
    *14,542 మంది మరణించారు
    * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 83,610#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/XUM7SfIdOL

    — ArogyaAndhra (@ArogyaAndhra) January 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దేశంలో కరోనా కేసులు..

Corona cases in India: మరోవైపు భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు.. 3,33,533 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 525 మంది మరణించారు. 2,59,168 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 17.78 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 93.18 శాతం నమోదైనట్లు పేర్కొంది.

  • మొత్తం కేసులు: 3,92,37,264
  • మొత్తం మరణాలు: 4,89,409
  • యాక్టివ్ కేసులు: 21,87,205
  • మొత్తం కోలుకున్నవారు: 3,65,60,650

Vaccination in India

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 71,10,445 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,61,92,84,270కు చేరింది.

సామాజిక వ్యాప్తి దిశగా..

సార్స్‌ కోవ్‌-2 వైరస్‌ వేరియంట్‌ అయిన ఒమిక్రాన్‌ మన దేశంలో సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని జన్యుక్రమాన్ని విశ్లేషించే సంస్థల కన్ఫార్షియం(ఇన్ఫాకాగ్‌) తెలిపింది. దిల్లీ, ముంబయి నగరాల్లో ఈ వేరియంట్‌ ప్రబలంగా ఉందని పేర్కొంది. విదేశీ ప్రయాణికుల నుంచి వ్యాపించే దాని కన్నా దేశీయంగా అంతర్గత వ్యాప్తే అధికంగా ఉన్నట్లు అంచనా వేసింది.

"వ్యాక్సిన్‌ పొందిన ప్రయాణికుల్లో తొలుత ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించడం జరిగింది. ఈ వేరియంట్‌ సోకినా ప్రస్తుతం చాలా మందిలో వైరస్‌ లక్షణాలు బహిర్గతం కావడంలేదు(అసింప్టమాటిక్‌). మరి కొందరిలో స్వల్ప స్థాయి లక్షణాలే కనిపిస్తున్నాయి. అయితే, టీకా తీసుకోని హైరిస్కు ఉన్న వ్యక్తుల్లోనూ ఇటువంటి తక్కువ ప్రభావాన్ని చూపుతుందని భావించడం సరికాదు" అని ఇన్ఫాకాగ్‌ హెచ్చరించింది.

ఇదీ చూడండి: మార్చి 31లోపు ప్రతి నియోజకవర్గంలో దళితబంధు అమలు: హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.