ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Mar 20, 2023, 11:37 AM IST

today-gold-rate-in-telangana-and-vijayawada
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరగింది. వెండి ధర తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?

Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.120 పెరిగి.. ప్రస్తుతం రూ.61,300గా ఉంది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.70 తగ్గి.. ప్రస్తుతం రూ.70,150 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.61,300 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర 70,150 రూపాయలుగా ఉంది.

Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.61,300గా ఉంది. కిలో వెండి ధర రూ.70,150 వద్ద కొనసాగుతోంది.

Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.61,300 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.70,150గా ఉంది.

Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.61,300గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,150 వద్ద ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,986 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22.47 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64 ఉంది. డీజిల్ ధర 97.80 రూపాయలుగా ఉంది. దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర .96.72 రూపాయలుగా ఉంటే.. డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ ధర రూ.22,60,237 పలుకుతోంది. ఇథీరియం, క్రిప్టోకరెన్సీలతో పాటుగా మరికొన్నింటి ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.22,60,237
ఇథీరియంరూ.1,44,772
టెథర్​రూ.82.77
బైనాన్స్​ కాయిన్​రూ.27,566
యూఎస్​డీ కాయిన్రూ.82.50

నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..
సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 518 పాయింట్ల నష్టపోయి 57,471 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 159 పాయింట్లు నష్టపోయి 16,940 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌యూఎల్‌ ఒక్కటే లాభాల్లో ఉంది. టాటా స్టీల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ, టీసీఎస్‌, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంతో దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాలకు గురవుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విదేశీ నిధులు తరలిపోవడం కూడా మార్కెట్లు నష్టపోవడానికి ఒక కారణమని చెబుతున్నారు.

రూపాయి మారకం విలువ..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 11 పైసలు పెరిగి.. ప్రస్తుతం 82.48 వద్ద కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.