ETV Bharat / business

మార్కెట్లకు లాభాలు.. సెన్సెక్స్ 437 ప్లస్

author img

By

Published : Jun 2, 2022, 3:45 PM IST

Updated : Jun 2, 2022, 4:10 PM IST

Stock Markets Close
Stock Markets Close

Stock Markets Close: స్టాక్​ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా బలమైన సంకేతాలతో సెన్సెక్స్ 437, నిఫ్టీ 105 పాయింట్లకుపైగా లాభపడ్డాయి.

Stock Markets Close: వరుసగా రెండు రోజులు పతనమైన స్టాక్​మార్కెట్లు గురువారం తిరిగి పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, రిలయన్స్​ ఇండస్ట్రీస్ లాంటి పెద్ద సంస్థలు రాణించటం వల్ల దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 437 పాయింట్లు ఎగబాకి 55,818 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 105 పాయింట్ల లాభంతో 16,628 వద్ద స్థిరపడింది.

లాభనష్టాల్లోనివి: రిలయన్స్, బజాజ్​ ఫిన్​సర్వ్​, సన్ ఫార్మా, హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​లు లాభాపడ్డాయి. అపోలో హాస్పిటల్స్, హీరో మోటర్​కార్ప్, ఐషర్​ మోటార్స్​, హెచ్​డీఎఫ్​సీ, పవర్​గ్రిడ్​ సంస్థలు నష్టపోయాయి. జీఎస్​టీ కలెక్షన్లు భారీగా రావడం, చమురు ధరలు తగ్గించడం వంటి కారణాలతో దేశీయ మార్కెట్లు లాభాలబాట పట్టాయి. ఆసియా మార్కెట్లు టోక్యో, హాంగాంక్​ నష్టపోగా.. చైనా షాంఘై మార్కెట్​ లాభాలతో ముగిసింది.

ఇదీ చదవండి: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా?

Last Updated :Jun 2, 2022, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.